Om Saravana Bhava book and story is written by LRKS.Srinivasa Rao in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Om Saravana Bhava is also popular in Mythological Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ఓం శరవణ భవ - Novels
by LRKS.Srinivasa Rao
in
Telugu Mythological Stories
కార్తికేయ చరితము కుమార గాధా లహరి తొలి పలుకులు కార్తికేయుడని, షణ్ముఖుడని ఉత్తరాపథం లోను, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఆర్ముగం అని దక్షిణ దేశం లోను కొలువబడుచున్న శివ" కుమారుడు అశేష జనావళికి జ్ఞాన ముక్తి ప్రదాత. వ్యాస ప్రోక్తమై, అష్టాదశ పురాణాల లో ఒకటైన" శ్రీ స్కాంద పురాణం " ప్రామాణికంగా సుబ్రహ్మణ్యుని చరితము ను వివరిస్తుంది. అంతేగాక, శివ, అగ్ని పురాణాలలో కూడా సందర్భోచితంగా కుమార గాధను ప్రస్తావించారు. ఇక కుమార సంభవం" షణ్ముఖుని కమనీయ గాధను కావ్యాత్మకంగా ప్రబోధించింది. దక్షిణ భారతంలో కాశ్యప శివాచార్యుని
కార్తికేయ చరితము కుమార గాధా లహరితొలి పలుకులుకార్తికేయుడని, షణ్ముఖుడని ఉత్తరాపథం లోను, సుబ్రహ్మణ్యుడు, మురుగన్, ఆర్ముగం అని దక్షిణ దేశం లోను కొలువబడుచున్న శివ" కుమారుడు అశేష జనావళికి జ్ఞాన ముక్తి ప్రదాత.వ్యాస ప్రోక్తమై, అష్టాదశ పురాణాల లో ఒకటైన" శ్రీ స్కాంద పురాణం " ప్రామాణికంగా సుబ్రహ్మణ్యుని చరితము ను వివరిస్తుంది. అంతేగాక, ...Read Moreఅగ్ని పురాణాలలో కూడా సందర్భోచితంగా కుమార గాధను ప్రస్తావించారు. ఇక కుమార సంభవం" షణ్ముఖుని కమనీయ గాధను కావ్యాత్మకంగా ప్రబోధించింది. దక్షిణ భారతంలో కాశ్యప శివాచార్యుని ( కచ్చియప్ప. అన్నీ నామంతో తమిళులు వ్యవహరిస్తారు. ) 'కంద పురాణం ' దేశీయత, విచిత్ర కధా సంవిధానం తో పండిత, పామర జనరంజకమైంది.పై గ్రంధాలన్నింటి సారమైన " శ్రీ స్కాంద పురాణ సారామృతం " నేటి కథా సంగ్రహమునకు మూలం. సంస్కృత దేశీయ భాషల్లోని ముఖ్య గ్రంధములను అవలోకించి, సారాన్ని గ్రహించి, శ్రీ నటరాజన్ ,
రాక్షస నాయకుడైన మహా సురుని పుత్రిక మాయాదేవి . కారణజన్మురాలు . శుక్రాచార్యుని ప్రియ శిష్యురాలు . అపూర్వ లావణ్య శోభిత మాయాదేవి . అసమాన ప్రజ్ఞాధురందరి . రాక్షస జాతి సముద్ధరణ కై కంకణం కట్టుకున్న ఈ కారణజన్మురాలు గురువు ఆనతి మేరకు కశ్యప ప్రజాపతి ని ఆశ్రయిస్తుంది. దైత్య కులవర్ధనుడైన ఆ ...Read Moreసేవించి , అయన సంపర్కము చే అసమాన బాల సంపన్నులు , అసహాయ శూరులు అయిన సోదర త్రయమునకు తల్లి అవుతుంది . సహస్రాధికమైన రాక్షస వీరుల జన్మకు కారణమవుతుంది . శూరపద్ముడు ,సింహ ముఖుడు, తారకాసురుడు తల్లిదండ్రులైన మాయాదేవి, కశ్యప ప్రజాపతులకు ప్రణమిల్లి మాతృవాక్య పరిపాలకులై ఘోర తపము చేయ తరలి వెళ్లి పోతారు . శివ ధిక్కార పాపము దక్ష ప్రజాపతి నే కాదు దేవతలను కూడా కష్టాల పాలు చేస్తుంది . సాధ్యాసాధ్యములను విశ్లేషించక దక్షుని ప్రాభవ
మహా పరివర్తనమునకు సమయం సమీపించింది . ఓంకార స్వరూపుడైన కుమారుడు ప్రభవించే శుభ తరుణం అతి చేరువలోనే ఉంది . సమున్నత హిమాలయ గిరి శృంగములు , మానస సరోవర ప్రాంతం ,. ప్రశాంత ప్రకృతి లో , పరమ రమణీయ ప్రదేశము లో ..... హిమవంతుడు , మేనక …. ...Read Moreఅచంచల తపోదీక్షలో ఉన్నాడు . ఆయన సంకల్పం మహోత్కృష్టం . శుభకరం. విశ్వ కల్యాణ కారకం . పరాత్పరుని పుత్రికగా పొందాలన్నది హిమవంతుని అభిమతం . అందులకే సాగుచున్నది నిశ్చల తపం . హిమవంతుని ధర్మపత్ని మేనక తపో దీక్షలో సర్వం మరచిన పతికి శుశ్రూషలు చేస్తూ సతిగా తన కర్తవ్యం నిర్వహిస్తూంది . తరుణమాసన్నమైంది . వినీల ‘ప్రభలు’ వెదజల్లే ఓ ‘దివ్య జ్యోతి’ సాకారమయ్యే క్షణం రానే వచ్చింది . అందుకు సంకేతంగా ప్రకృతి లో ఆణువణువూ పులకించి పోయింది .
సోదర త్రయం లో రెండవవాడైన సింహ ముఖుడు అసురుడైననూ సర్వశాస్త్రములు తెలిసిన వివేకి . సహజమగు అసుర స్వభావం తో నాశము కోరి తెచ్చుకుంటున్న అన్నగారిని వరించ తన వంతు ప్రయత్నం చేస్తాడు . కానీ, ఫలితం శూన్యం . శూర పద్ముని పట్టుదల, పంతం యుద్ధానికే దారితీశాయి . శూర పద్ముని ...Read Moreమనోభీష్టం నారదమహర్షి సమయస్ఫూర్తి , సరస సంభాషణతో మరింత దృఢమవుతుంది . దేవతలపై , దండయాత్ర చేయాలనీ రాక్షసకోటి తీర్మానిస్తుంది . శూర పద్ముడు అశేష సేన వాహిని తో అలకాపురిపై దాడి చేస్తాడు . ఎలాంటి ప్రతిఘటన లేకుండా కుబేరుడు శూర పద్ముడికి లొంగి పోతాడు . కానుకలు సమర్పించి రాక్షసపతిని ప్రసన్నం చేసుకుంటాడు . సునాయాస విజయం తో విజృంభించిన శూర పద్ముడు అమరావతి పై దడి చేస్తాడు . అతడి ధాటికి నిలువలేని సురాధిపతి ఆకాశమార్గాన పారిపోతాడు . దానవేంద్రుడు
మనసు చెదిరినట్లు నటించిన మహాదేవుడు లిప్తకాలం మూడో నేత్రం కొద్దిగా తెరిచి మన్మధుని వైపు దృష్టి సారించాడు . ఆ స్వల్ప వీక్షణానికే సుమశరుడు భస్మావశిష్టమైపోయాడు . ఈ ఘోరానికి తల్లడిల్లిపోయింది రతీదేవి శంకరుని పాదాలపై పడి పతి భిక్ష ప్రసాదించమని వేడుకుంటుంది . కరుణించిన కైలాసపతి కన్నులు తెరిచి , ఇదంతా ...Read Moreలీలా విశేషమని , ‘శుభ తరుణం’ సమీపించగానే మన్మధుడు పునర్జన్మ పొందగలడని ఊరడించి పంపుతాడు . తిరోగమించిన సుమశరం హిమాలయము చేరి హైమావతి ఎదలో సున్నితం గా నాటుకుంటుంది . తత్ఫలితంగా ఆమె లో భావసంచలనం కలుగుతుంది . మధుర భావనలతో ఆమె ఏకాగ్రత కోల్పోతుంది . ఈ పరివర్తనమునకు కారణమేమిటో